కొత్తగా 22 కొవిడ్ కేసులు
ABN , First Publish Date - 2021-01-17T05:25:56+05:30 IST
జిల్లాలో శనివారం కొత్తగా 22 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
జిల్లాలో 60,031కి చేరిన మొత్తం బాధితుల సంఖ్య
విశాఖపట్నం, జనవరి 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో శనివారం కొత్తగా 22 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 60,031కి చేరాయి. వీరిలో వైరస్ నుంచి 59,332 మంది కోలుకోగా మరో 170 మంది చికిత్స పొందుతున్నారు. కాగా ఇప్పటివరకు 529 మంది కొవిడ్ బారిన పడి మృత్యువాత చెందారు.