పౌరగ్రంథాలయాన్ని సందర్శించిన బాలు
ABN , First Publish Date - 2020-09-26T09:26:07+05:30 IST
ద్వారకానగర్లోని విశాఖ పౌరగ్రంథాలయాన్ని ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 2016లో సందర్శించారు.
సీతంపేట, సెప్టెంబరు 25: ద్వారకానగర్లోని విశాఖ పౌరగ్రంథాలయాన్ని ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 2016లో సందర్శించారు. గ్రంథాలయం నిర్వహణ తీరును మెచ్చుకున్నారు. అదే విషయాన్ని సందర్శకుల రిజిస్టర్లో రాసి సంతకం పెట్టారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సొసైటీ కార్యదర్శి డి.ఎల్.ఎన్.వర్మ మాట్లాడుతూ సినీ జగత్తుకు బాలులేని లోటు తీర్చలేనిదన్నారు. గ్రంథాలయ ప్రతినిధుల తరపున ఆయనకు నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు.