కేవైసీ పేరుతో మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2020-09-28T10:42:02+05:30 IST
పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్లను వినియోగించేవారంతా కేవైసీ పేరుతో జరిగే మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని క్రైమ్ డీసీపీ వి.సురేశ్బాబు హెచ్చరించారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ఫోన్లను వాడుతున్నందున మనీ ట్రాన్స్ఫర్ యాప్లను వాడుతున్నారని, దీనిని సైబర్ మోసగాళ్లు ఆసరాగా తీసుకుని నేరాలకు పాల్పడుతున్నారన్నారు.
కేవైసీ పేరుతో మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
క్రైమ్ డీసీపీ వి.సురేశ్బాబు
విశాఖపట్నం, సెప్టెంబర్ 27(ఆంధ్రజ్యోతి): పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్లను వినియోగించేవారంతా కేవైసీ పేరుతో జరిగే మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని క్రైమ్ డీసీపీ వి.సురేశ్బాబు హెచ్చరించారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ఫోన్లను వాడుతున్నందున మనీ ట్రాన్స్ఫర్ యాప్లను వాడుతున్నారని, దీనిని సైబర్ మోసగాళ్లు ఆసరాగా తీసుకుని నేరాలకు పాల్పడుతున్నారన్నారు.
యాప్లను వినియోగించేవారిని సైబర్ నేరగాళ్లు గుర్తించి వారి ఫోన్లకు కేవైసీ అప్డేట్ చేయాలంటూ మెసేజ్లు పంపుతున్నారన్నారు. ప్రజలు వాటిని నిజమేనని భావించి తమ బ్యాంకు వివరాలను సెబర్ నేరగాళ్లకు అందజేస్తున్నారన్నారు. ఆ వివరాలు ఆధారంగా సైబర్ నేరగాళ్లు ఖాతాలోని సొమ్ముని కాజేసేస్తున్నారని వివ రించారు. ఇటీవ లి కాలంలో ఈ తరహా నేరాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజలు దీనిని గుర్తించి కేవైసీ అప్డేట్ పేరుతో వచే ్చ మెసేజ్లకు స్పందించవద్దని కోరారు.