మనకిది కొత్త సంవత్సరం!
ABN , First Publish Date - 2021-04-13T06:26:41+05:30 IST
ఉగాదిని ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథి నాడు జరుపుకొంటారు. తెలుగు వారికి ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది
ఉగాదిని ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథి నాడు జరుపుకొంటారు. తెలుగు వారికి ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది.
- మహారాష్ట్రీయుల కొత్త సంవత్సరం కూడా చైత్రశుద్ధ పాడ్యమినాడే మొదలవుతంది. మనం ఉగాదిగా పిలుచుకుంటే.. వారు ‘గుడిపడ్వా’గా నిర్వహించుకుంటారు. ఈ రోజున.. ఇంటిముందు ఒక వెదురు కర్రను నిలిపి, దానికి జరీ వస్ర్తాన్నీ కడతారు. ఆ వస్త్రం మీద దండలు, ఆకులు వేలాడదీసి, ఒక రాగి చెంబును బోర్లిస్తారు. దీనినే గుడి అని పిలుస్తారు. అలా పాడ్యమి రోజున గుడిని నెలకొల్పె సంప్రదాయమే ‘గుడిపడ్వా’గా మారింది.
- అసోం ప్రజలు ‘బిహు’ పండుగను అత్యంత వైభవంగా జరుపుకొంటారు. వాళ్లకు ఇది కొత్త సంవత్సరంతో పాటు, వ్యవసాయాన్ని ఆరంభించే పండుగ కూడా. బిహును మూడు రోజులు చేసుకుంటారు. మొదటి రోజు పొలంలో నాట్లు వేస్తారు. రెండో రోజు సంప్రదాయ నృత్యాలు చేస్తారు. ఇక చివరిరోజు గోమాతను పూజిస్తారు.
- మలయాళీలు ఉగాదిని ‘విషు’గా చేసుకుంటారు. ఈరోజు తీపి పదార్థాలు చేసి, తమ బంధువులకు పంచిపెడుతుంటారు. ఇలా చేస్తే సంవత్సరమంతా శుభం కలుగుతుందని వారి నమ్మకం.
- ఉగాది పచ్చడిలో ఆరు రుచులు ఉంటాయి. బెల్లం, చింతపండు, వాము, మామిడి, వేపపువ్వు, ఉప్పు కలిపి పచ్చడి తయారుచేస్తారు.