అవినీతి రహిత సమాజం కోసం కృషి చేయాలి

ABN , First Publish Date - 2020-10-17T07:33:49+05:30 IST

అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సమాచార హక్కు రక్షణ చట్టం ప్రతినిధులు అన్నారు.

అవినీతి రహిత సమాజం కోసం కృషి చేయాలి

కామారెడ్డి టౌన్‌, అక్టోబరు 16: అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సమాచార హక్కు రక్షణ చట్టం ప్రతినిధులు అన్నారు. శుక్రవారం కామారె డ్డి జిల్లా కేంద్రంలోని బృందావన్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఆర్‌టీఐ కార్యక ర్తలను భాగస్వామ్యం చేయాలని, మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకుట్ట వేసేందుకు తగిన విధంగా స్పందించాలని, వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకో వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.


ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్రపై అవగాహ న సదస్సులు అవినీతి రహితసమాజాన్ని ఏర్పాటు చేయడానికి సహచట్టం, సమాచార సేకరణ సభ్యులు కలిసి పని చేయడానికి సదస్సులు నిర్వహించాలని చర్చించామ న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వేణు, సెక్రటరీ రామకృష్ణ, ఉపాధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌, కామారెడ్డి పట్టణ ఇన్‌చార్జ్‌ హన్మంత్‌రావు, సురేష్‌ యాదయ్య, నవీన్‌ కుమార్‌, శ్రావణి, రజిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-17T07:33:49+05:30 IST