తెలంగాణలోనూ పాగా వేస్తాం

ABN , First Publish Date - 2022-03-11T05:46:44+05:30 IST

నాల్గు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంతో జిల్లా కేంద్రంలోని వీర సావర్కర్‌ చౌరస్తాలో గురువారం బీజేపీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేల్చి నృత్యాలు చేస్తూ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు.

తెలంగాణలోనూ పాగా వేస్తాం
మక్తల్‌ అంబేడ్కర్‌ చౌరస్తాలో సంబురాలు జరుపుకుంటున్న బీజేపీ నాయకులు

- బీజేపీ నాయకుడు నాగూరావు నామాజీ

- బీజేపీ విజయోత్సవాలు

నారాయణపేట, మార్చి 10 :  నాల్గు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంతో  జిల్లా కేంద్రంలోని వీర సావర్కర్‌ చౌరస్తాలో గురువారం బీజేపీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేల్చి నృత్యాలు చేస్తూ  సంబురాలను  ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగూరావు నామాజీ, రతంగ్‌ పాండురెడ్డి మాట్లాడుతూ అవినీతి లేని పాలన చేసినందుకు ఉత్తరప్రదేశ్‌, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌, గోవాలో బీజేపీని మళ్లీ గెలిపించారన్నారు. అవినీతిలో కూరుకుపోయిన టీఆర్‌ఎస్‌ ప్రభు త్వాన్ని పతనం చేస్తామన్నారు. కార్యక్ర మంలో బీజేపీ నాయకులు సత్యయాదవ్‌, నందు, రఘువీర్‌, లక్ష్మణ్‌, మల్లేష్‌, లక్ష్మీ శ్యాంసుందర్‌, సుజాత, కౌన్సిలర్లు జయశ్రీ, అంబిక, విశాలాక్షి పాల్గొన్నారు.

మక్తల్‌ : ఉత్తరప్రదేశ్‌, మణిపూర్‌, ఉ త్తరాఖాండ్‌, గోవా రాష్ర్టాల్లో బీజేపీ ఘన విజయం సాధించడంపై పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ఆ పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి మిఠాయిలు తినిపించు కొని సంబురాలు జరుపుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య మాట్లా డుతూ దేశంలో మోదీకి ప్రజాదరణ తగ్గలే దని చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలతో మరోమారు రుజువైందన్నారు.  రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారం లోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకుడు కర్ని స్వామి, దేవరింటి నర్సింహారెడ్డి, మండలాధ్యక్షుడు లక్ష్మణ్‌, పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, నా యకులు సత్య శ్రీనివాసులు, మంజునాథ్‌, బుగ్గన్న,  వెంకటయ్య, రహీంపటేల్‌, మోహన్‌గౌడ్‌, మహేష్‌సాగర్‌  పాల్గొన్నారు. 

కృష్ణ : ఐదు రాష్ర్టాల బీజేపీ విజయం సాధించడంతో మండల కేంద్రంలో బీజేపీ నాయకులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఆ పార్టీ జిల్లా ఉపా ధ్యక్షుడు సోమశేఖర్‌గౌడ్‌, సురేష్‌, మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌, నల్లే నర్సప్ప, నారా యణభట్‌, తాయప్పగౌడ్‌, శక్తిసింగ్‌ఠాకూర్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు.

మరికల్‌ : ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాల్గు రాష్ట్రాల్లో విజయం సాధించడంతో మండల కేంద్రంలోని ఇందిరా గాంధీ చౌరస్తాలో బీజేపీ నాయకులు పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించా రు. కార్యక్రమంలో నాయకులు తిరుపతిరెడ్డి, వేణు, శ్రీరామ్‌, వెంకటేష్‌, కురుమన్న, చెన్నయ్య పాల్గొన్నారు.

మాగనూరు : బీజేపీ నాలుగు రాష్ర్టాల్లో ఘన విజయం సాధించడంతో మండల కేంద్రంలో బీజేపీ నాయకులు బాణ సంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సోమశేఖర్‌గౌడ్‌ మాట్లాడుతూ దేశ అభివృద్ధికి యువకులు ముందుకొచ్చి బీజేపీలో చేరాలని పిలుపుని చ్చారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అశోక్‌గౌడ్‌, బాబుగౌడ్‌, జిల్లా నాయకులు మజ్జిగ సురేష్‌, బాలరాజు, ఆంజనేయులుగౌడ్‌, భీంరాజ్‌ పాల్గొన్నారు.

దామరగిద్ద : మండల కేంద్రంలో బీజేపీ నాయకులు బాణసంచా కాల్చి సంబురాలను జరుపుకున్నారు. ఆ పార్టీ మండలాధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. కార్యక్రమంలో నాయకులు మాణిక్యప్ప, నబీ, అశోక్‌, శ్రీనివాస్‌, నారాయణ, కన్కిరెడ్డి, ఈదప్ప పాల్గొన్నారు.







Updated Date - 2022-03-11T05:46:44+05:30 IST