ఆర్యవైశ్య హాస్టల్ నిర్మాణానికి సహకారం అందిస్తాం
ABN , First Publish Date - 2021-10-18T05:59:50+05:30 IST
పట్టణంలో ఆర్యవైశ్యహాస్టల్ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని మున్సిపల్ చైర్పర్సన్ లింగం నిర్మల తెలిపారు.
-మున్సిపల్ చైర్పర్సన్ లింగం నిర్మల
ధర్మవరంరూరల్, అక్టోబరు17: పట్టణంలో ఆర్యవైశ్యహాస్టల్ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని మున్సిపల్ చైర్పర్సన్ లింగం నిర్మల తెలిపారు. ఆదివారం ఆర్యవైశ్యసంఘం ఆధ్వర్యంలో స్థానిక మారుతీనగర్లో ఆర్యవైశ్యహాస్టల్కి సంబం ధించిన స్థలములో వనవిహారిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడు కలవలరామ్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ లింగంనిర్మల, వైస్ చైర్మన్లు చందమూరు నారాయణరెడ్డి, మాసపల్లి సా యికుమార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ము న్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ దాతృత్వానికి ఆర్యవైశ్యులు పెట్టింది పేరని కొనియా డారు. ఆర్యవైశ్యులు లాభాపేక్ష లేకుండా వివిధసేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా రని, అలాంటి ఆర్యవైశ్యులకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలాసహాయసహాకారాలు అందిస్తామన్నారు. ప్రత్యేకించి మారుతీనగర్లో చేపట్టబోయే ఆర్యవైశ్యల హాస్టల్ నిర్మాణానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సహాకారంతో సహకరిస్తామన్నారు. త్వరతగతిన నిర్మాణాన్ని చేపట్టి ఆర్యవైశ్యుల విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిం చాలన్నారు. అనంతరం ముందుగాపూజ కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటారు. అదేవిధంగా ఆర్యవైశ్య మహిళామండలి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఆర్యవైశ్య హాస్టల్ నిర్మాణ కమిటీ చైర్మన్గా కోఅప్షన్ మెంబర్ బూశెట్టి రామకృష్ణను ఏకగ్రీవంగా ఆర్య వైశ్య సంఘం ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు కలవల మురళీధర్, వైసీపీ నాయకులు ఉడుములరాము, ఆర్యవైశ్యసంఘం, యువజన సంఘం, మహిళ మండలి, భజనమండలి, నగరసం కీర్తన మండలి సభ్యులు పాల్గొన్నారు.