పాడి పశువులకు షెడ్లు నిర్మిస్తాం

ABN , First Publish Date - 2021-01-21T06:09:27+05:30 IST

పాడి పశువులకు షెడ్లు నిర్మిస్తామని విశాఖ డెయిరీ ఉపాధ్యక్షుడు ఆడారి ఆనంద్‌కుమార్‌ చెప్పారు.

పాడి పశువులకు షెడ్లు నిర్మిస్తాం
పాడి రైతులకు సరుకులు పంపిణీ చేస్తున్న ఆనంద్‌

విశాఖ డెయిరీ ఉపాధ్యక్షుడు ఆడారి ఆనంద్‌కుమార్‌


కశింకోట, జనవరి 20: పాడి పశువులకు షెడ్లు నిర్మిస్తామని విశాఖ డెయిరీ ఉపాధ్యక్షుడు ఆడారి ఆనంద్‌కుమార్‌ చెప్పారు. అమీన్‌సాహెబ్‌పేట బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ సెంటర్‌ వద్ద డెయురీ డైరెక్టర్‌ మలసాల రమణరావు ఆధ్వర్యంలో ఆనంద్‌ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయం చేయడంతో పాటు పాడి సంపదను పెంచుకోవాలని సూచించారు. రైతులకు బోర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాల ఉత్పత్తిదారులకు స్టీల్‌ పాల క్యాన్లు, బియ్యం, చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యురాలు మలసాల కాసులమ్మ, పాల సంఘం ప్రతినిఽధులు జె.నూకునాయుడు, ఎస్‌.గోవింద పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T06:09:27+05:30 IST