హైకోర్టు తీర్పును సవాల్ చేస్తాం: ఢిల్లీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-09-22T22:01:44+05:30 IST

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తాం: ఢిల్లీ ప్రభుత్వం

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తాం: ఢిల్లీ ప్రభుత్వం

న్యూఢిల్లీ: ప్రైవేటు ఆసుపత్రుల్లోని ఐసీయూల్లో 80 శాతం పడకల్ని కోవిడ్-19 రోగుల కోసం కేటాయించాలన్న ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. మరోసారి దీనిపై తాము వాదనలు వినేంత వరకు ప్రభుత్వం తమ ఆదేశాలను కొనసాగించరాదని తేల్చి చెప్పింది. అయితే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఢిల్లీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు తీర్పును తాము సవాల్ చేస్తామని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అన్నారు. కరోనాపై మరింత ఉధృత పోరాటం చేయాలంటే ప్రస్తుతం తాము తీసుకున్న నిర్ణయాలు అమలు కావాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉందని ఆయన అన్నారు. 

Updated Date - 2020-09-22T22:01:44+05:30 IST