సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు

ABN , First Publish Date - 2022-07-26T05:00:23+05:30 IST

రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సీఎం జగన్‌ పాలన సాగుతుందని వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌ అన్నారు.

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు
కరపత్రాలు పంచుతున్న వైసీపీ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌

 వైసీపీ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌

చీరాల, జూలై 25: రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సీఎం జగన్‌ పాలన సాగుతుందని వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌ అన్నారు. మున్సిపల్‌ పరిధిలోని 25వ వార్డు విఠల్‌ నగర్‌లో సోమవారం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఇంటి ంటికి తిరుగుతూ వైసీపీ పాలనలో ప్రజలు పొందుతున్న ఆసరాను వివరించారు. ప్రతి కుటుంబం ఆ సహాయాలను సద్విని యోగం చేసుకోవాలన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హత ఉండి లబ్ధిపొందకపోతే వెంటనే మరలా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఇంటివద్ద వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సేవలను వివరించే కరపత్రాలను పంపిణీ చేశారు. 

కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ సీహెచ్‌ మల్లీశ్వరావు, మున్సిప ల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, వైస్‌చైర్మన్‌ బొనిగల జైసన్‌బాబు, కోఆప్షన్‌ సభ్యురాలు కోడూరి నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-26T05:00:23+05:30 IST