సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2021-01-21T05:28:07+05:30 IST
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ పేర్కొన్నారు.
సబ్బవరం, జనవరి 20: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ పేర్కొన్నారు. మండలంలోని తవ్వవానిపాలెం, గొర్లివానిపాలెం, రాయపురఅగ్రహారం, సబ్బవరం శివారు చినగొల్లలపాలెంలో బుధవారం ఆయన ఇళ్ల స్థల పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమం లో వైసీపీ నేతలు కొటాన రాము, అప్పారావు, అచ్చింనాయుడు, ఉమామ హేశ్వరరావు, రామునాయుడు, నారాయణమూర్తి, తహసీల్దార్ రమాదేవి, హౌసింగ్ ఏఈ శేఖరనాయుడు తదితరులు పాల్గొన్నారు.
భూముల రీ సర్వే చారిత్రక ఘట్టం
రాష్ట్రంలో భూముల రీ సర్వే కార్యక్రమం చారిత్రక ఘట్టమని ఎమ్మెల్యే అదీప్రాజ్ పేర్కొన్నారు. పెదగొల్లలపాలెం శివారు విప్పాకఅగ్రహారంలో ఆయన సర్వే డ్రోన్ కెమెరాను ప్రారంభించారు. వందేళ్ల కిందట భూముల సర్వే జరిగిందని, అప్పటి నుంచి పేరుకుపోయిన అనేక వివాదాలకు రీసర్వేతో మోక్షం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వీఆర్వోల సంఘం అధ్యక్షుడు ఎస్టి రామకాసు, తహసీల్దార్ రమాదేవి, సర్వేయర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.