చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి
ABN , First Publish Date - 2021-02-25T04:43:16+05:30 IST
మండల కేంద్రంలోని శివార్ రాంరెడ్డి పల్లెకు చెందిన మామిండ్ల పోచయ్య(58) మృతి చెందినట్లు ఏఎస్ఐ రాములు తెలిపారు.
బీబీపేట, ఫిబ్రవరి 24: మండల కేంద్రంలోని శివార్ రాంరెడ్డి పల్లెకు చెందిన మామిండ్ల పోచయ్య(58) మృతి చెందినట్లు ఏఎస్ఐ రాములు తెలిపారు. మంగళవారం ఎగువమానేర్లోకి చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశా త్తు తెప్పపై నుంచి పడడంతో చేపల వల కాళ్లకు చుట్టు కుంది. దీంతో ఊపిరి ఆడక మృతిచెందాడు. మృతుడి కు మారుడు మామిండ్ల సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరి యా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.