పశ్చిమగోదావరి జిల్లాలో వృద్ధ దంపతుల అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2021-11-13T17:24:10+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సుబ్బారావుపేటలో వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సుబ్బారావుపేటలో వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ముత్తా శ్రీ కృష్ణ మూర్తి(75) బయట నీళ్ల కుండిలో పడి మృతి చెందగా... భార్య కుమారి (65) ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. హత్యలా.. ఆత్మహత్యలా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.