కరోనాను భరించాల్సిందే
ABN , First Publish Date - 2021-04-14T05:19:58+05:30 IST
ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా వైరస్తో మరికొంత కాలం సహజీవనం చేయడం తప్పదని ప్రముఖ పండితుడు జీవీ మాధవశర్మ అన్నారు.
ప్రముఖ పండితుడు జీవీ మాధవశర్మ
ఆచంట, ఏప్రిల్ 13 : ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా వైరస్తో మరికొంత కాలం సహజీవనం చేయడం తప్పదని ప్రముఖ పండితుడు జీవీ మాధవశర్మ అన్నారు.ఆచంటేశ్వరుడి సన్నిధిలో పండితుడు జీవీ మాధవశర్మ పంచాంగ శ్రవణం గావించారు.వికారి నామ సంవత్సరంలో ప్రారంభ మైన కరోనా వైరస్తో ప్రపంచంలోని అన్ని దేశాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని.. ప్రస్తుతం ప్లవ నామ సంవత్సరంలో వైరస్ ప్రభావం కొంత మేర తగ్గినప్పటికి వచ్చే సంవత్సరం అక్టోబర్ 28వ తేదీ వరకు దీని ప్రభావం ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో దేవస్థాన అదికారులు రామపెద్దింట్లురావు,ఆర్వీఎస్ రామ్కుమార్ పాల్గొన్నారు.