పాల సేకరణ పెంచాలి : కలెక్టర్
ABN , First Publish Date - 2021-06-24T04:52:14+05:30 IST
జిల్లాలో జగనన్న అమూల్ పాలవెల్లువ కార్యక్రమంలో అన్ని పాల సేకరణ కేంద్రాల్లో పాల సేకరణ పెంచే విధంగా చ ర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు.
ఏలూరు, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జగనన్న అమూల్ పాలవెల్లువ కార్యక్రమంలో అన్ని పాల సేకరణ కేంద్రాల్లో పాల సేకరణ పెంచే విధంగా చ ర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మండలస్థాయి అధికారులతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ పాల సేకరణ జరుగుతున్న సొసైటీలలో ప్రతివారం సమావేశాలు నిర్వహించి వారి సమస్యల గురించి చర్చించి పరిష్కరించాలన్నారు. జిల్లాలో 117 సొసైటీల నుంచి రోజుకు 6,953 లీటర్ల పాల సేకరణ జరుగుతోందని, నెలాఖరుకు 8 వేల లీటర్లకు పెరగాలన్నారు. అన్ని గ్రామాల్లో పాల సేకరణ చేసేలా చర్యలు తీసుకో వాలన్నారు. వీసీలో జేసీ వెంకట రమణారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఉదయభాస్కర్, డెయిరీ డీడీ ఉమాదేవి, డీసీవో, పశుసంవర్థక శాఖ అధికారులు పాల్గొన్నారు.