పోలీసుల మోటార్ సైకిల్ ర్యాలీ
ABN , First Publish Date - 2021-03-03T05:48:42+05:30 IST
ఏలూరు రూరల్ స్టేషన్ పరిధిలోని పోణంగి, సాయినగర్, ఇందిరాకాలనీ ప్రాంతాల్లో పోలీస్ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఏలూరు క్రైం, మార్చి 2 : ఓటు హక్కును ప్రజలు స్వేచ్ఛగా వినియోగించుకోవా లని ఏలూ రు రూరల్ ఎస్ఐ చావా సురేష్ సూచించారు. ఏలూరు రూరల్ స్టేషన్ పరిధిలోని పోణంగి, సాయినగర్, ఇందిరాకాలనీ ప్రాంతాల్లో పోలీస్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రాంతాలు ఏలూరు నగర కార్పొరేషన్లో 13, 14 డివిజన్లు కావడంతో ఈ నెల 10న నగర కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్క డా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగ కుండా పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఎవరైనా సమస్యలు సృష్టించాలని ప్రయత్నిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎన్నికల్లో క్రిమినల్ కేసు నమోదైతే వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తారని స్పష్టం చేశారు.