వారిని బస్ ఎక్కనివ్వం
ABN , First Publish Date - 2021-04-17T05:25:09+05:30 IST
మాస్క్ లేకుంటే బస్సు ఎక్కించుకోమని ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసు లు స్పష్టం చేశారు.
ఏలూరు రూరల్, ఏప్రిల్ 16: మాస్క్ లేకుంటే బస్సు ఎక్కించుకోమని ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసు లు స్పష్టం చేశారు. శుక్రవారం ఏలూరు ఆర్టీసీ కొత్త బస్టాండ్లో మాస్క్ లేకుండా ప్రయాణి స్తున్న వారికి మాస్క్లు పంపిణీ చేసి, అవగా హన కల్పించారు. కరోనా నియంత్రణకు మాస్కే ఆయుధమని, ఇందుకు ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి ప్రయాణం సాగించాలని కోరారు. మా స్క్ లేకుండా బస్సుల్లో ఎక్కించుకునే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. డిపో మేనేజర్ సునీత, పీఆర్వో నరసింహం, ఆర్టీసీ ట్రాఫిక్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.