లెక్క తేలింది

ABN , First Publish Date - 2021-03-04T05:27:34+05:30 IST

నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబం ధించి నామినేషన్ల పర్వం ముగిసింది.

లెక్క తేలింది
నగర పాలక సంస్థ కార్యాలయంలో నామినేషన్ల ఉపసంహరణ సందడి

ముగిసిన నామినేషన్లు .. బరిలో 172 మంది 

107 మంది నామినేషన్ల ఉపసంహరణ

 మొత్తం డివిజన్లు 50.. మూడు  ఏకగ్రీవం

ఏలూరు టూటౌన్‌, మార్చి 3: నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబం ధించి నామినేషన్ల పర్వం ముగిసింది. ఎన్నికల సంఘం నామినేషన్ల ఉప సంహరణకు మంగళ, బుధ వారాలు సమయం ఇచ్చింది. బుధవారం మధ్యాహ్నం మూడు గంటలతో నామినేషన్ల గడువు ముగిసింది. నామి నేషన్ల పరిశీలన అనంతరం 282 నామినేషన్లు మిగిలాయి. బుధవారం 42 మంది, మంగళవారం 65 మంది అభ్యర్థులు మొత్తం 107 మంది నామి నేషన్లు ఉపసంహరించు కున్నారు. మొత్తం 50 డివిజన్లకు మూడు డివిజన్లు  ఏకగ్రీవం అయిన సంగతి విదితమే. ఈ మూడు కూడా వైసీపీ చేజిక్కించుకుంది.  తుదిబరిలో 172 మంది ఉన్నారు. ఏకగ్రీవాలు పోను మిలిగిన 47 డివిజన్లలో ఈనెల 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. కాగా బుధవారం టీడీపీ 18, వైసీపీ 16, కాంగ్రెస్‌ 2, సీపీఐ 2, ఇండిపెండెంట్లు నలుగురు మొత్తం 42 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 

Updated Date - 2021-03-04T05:27:34+05:30 IST