Viral Video: రైలు పట్టాలపై బైక్‌పై వ్యక్తి.. ఎదురుగా దూసుకొస్తున్న ట్రైన్.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

ABN , First Publish Date - 2022-02-16T22:26:09+05:30 IST

పెద్ద ప్రమాదాల నుంచి కొందరు ఎలాంటి గాయాలూ కాకుండా క్షేమంగా బయటపడుతూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ముంబైలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తికి భూమ్మీద చాలా నూకలున్నట్లు ఉన్నాయి. ఒక్క క్షణం ఆలస్యమైనా...

Viral Video: రైలు పట్టాలపై బైక్‌పై వ్యక్తి.. ఎదురుగా దూసుకొస్తున్న ట్రైన్.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

‘‘పొద్దున లేచి ఎవరి ముఖం చూశానో.. కాసేపుంటే ఎంత ఘోరం జరిగుండేది.. టైం బాగుంది కాబట్టి సరిపోయింది’’.. ప్రతి ఒక్క వ్యక్తికి, తన జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవం ఎదురవుతూ ఉంటుంది. పెద్ద ప్రమాదాల నుంచి కొందరు ఎలాంటి గాయాలూ కాకుండా క్షేమంగా బయటపడుతూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ముంబైలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తికి భూమ్మీద చాలా నూకలున్నట్లు ఉన్నాయి. ఒక్క క్షణం ఆలస్యమైనా చాలా పెద్ద ప్రమాదం జరిగుండేది.


ముంబైలోని ఓ రైల్వే గేటు ప్రాంతంలో ఫిబ్రవరి 12న ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు వస్తుండడంతో గేటు వేసి ఉంది. దీంతో రైల్వే గేటుకు అటు, ఇటూ వాహనాలన్నీ ఆగిపోయాయి. ఈ సమయంలో ఓ వ్యక్తి బైకుపై వస్తూ ఎలాగైనా పట్టాలు దాటి పోవాలనే ఉద్దేశంతో దూసుకెళ్లాడు. అయితే రైలు పట్టాల మీదకు వెళ్లగానే ఒక్కసారిగా బైకి అదుపుతప్పింది. అప్పుడే రాజధాని ఎక్స్‌ప్రెస్ దూసుకొచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఆ వ్యక్తి.. బండిని వదిలేసి పక్కకు పరుగులు తీశాడు.

సైకిల్‌ని ఇలా కూడా నడపొచ్చా... ఈ వ్యక్తి సైకిల్ మీద చేసిన విన్యాసం చూస్తే WOW అంటారు..


అత్యంత వేగంగా వచ్చిన రైలు ఒక్కసారిగా ఢీకొనడంతో బైకు ఎగిరి పక్కన పడింది. ఆ వ్యక్తికి మాత్రం ఎలాంటి గాయాలూ కాలేదు. ఈ తంతు మొత్తం క్షణాల్లో జరిగిపోయింది. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో ఈ ఘటన మొత్తం రికార్డ్ అయింది. రాజేంద్ర అక్లేకర్ అనే జర్నలిస్ట్.. తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఈ వీడియోను పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై రైల్వే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయం తెలియాల్సి ఉంది.

విమానం గాలిలో ఉండగా.. లోపలికి ఇదెలా వచ్చింది.. ‘అమ్మ బాబోయ్!’ అంటూ అవాక్కయిన ప్రయాణికులు





Updated Date - 2022-02-16T22:26:09+05:30 IST