భర్త మందులకు డబ్బులు లేవని ఆ మహిళ చేసిన పని ఇది.. చివరకు పోలీసులకు దొరికిపోయి..
ABN , First Publish Date - 2021-11-16T17:14:44+05:30 IST
ఆమె పేరు మన్ప్రీత్ కౌర్.. ఆమె భర్త అనారోగ్యానికి గురయ్యాడు..
ఆమె పేరు మన్ప్రీత్ కౌర్.. ఆమె భర్త అనారోగ్యానికి గురయ్యాడు.. దీంతో అతడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.. అతని మందులకు భారీగా ఖర్చవుతోంది.. పేద కుటుంబానికి చెందిన ఆ మహిళ డబ్బుల కోసం ఓ మొబైల్ను దొంగిలించింది.. వేరే వ్యక్తికి అమ్మేసింది.. చివరకు పోలీసులకు దొరికిపోయి జైలుకు వెళ్లింది.. పంజాబ్లోని లూథియానాలో ఈ ఘటన జరిగింది.
స్నేహితుడి భార్యను చూసేందుకు జతిందర్ సింగ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఆదివారం లూథియానా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. హాస్పిటల్ వార్డులో అతని భార్య తన మొబైల్ను పక్కన పెట్టి తన స్నేహితురాలితో మాట్లాడింది. తర్వాత చూసే సరికి ఫోన్ కనిపించలేదు. దీంతో వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు. దర్యాఫ్తు ప్రారంభించిన పోలీసులు మన్ప్రీత్ కౌర్ను అదుపులోకి తీసుకుని మొబైల్ను స్వాధీనం చేసుకుని జతిందర్కు అందించారు. తన భర్త అనారోగ్యంతో ఉన్నాడని, అతడి మందుల కోసమే దొంగతనం చేశానని మన్ప్రీత్ అంగీకరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.