21 ఏళ్ల కూతురిని ఇంట్లో ఉంచి పనిమీద బయటకెళ్లిన కుటుంబ సభ్యులు.. సాయంత్రం తిరిగొచ్చి చూస్తే కనిపించిన దృశ్యం చూసి..
ABN , First Publish Date - 2021-12-04T19:53:04+05:30 IST
ఇంట్లో 21 ఏళ్ల కూతురిని వదిలేసి వారంతా బంధువుల ఇంట్లో వేడుకకు వెళ్లారు..
ఇంట్లో 21 ఏళ్ల కూతురిని వదిలేసి వారంతా బంధువుల ఇంట్లో వేడుకకు వెళ్లారు.. సాయంత్రం తిరిగి వచ్చి చూసే సరికి ఆమె ఉరేసుకుని చనిపోయింది.. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టమ్కు తరలించారు. ఆత్మహత్యకు గల కారణం బయటకు రాలేదు. రాజస్థాన్లోని కోట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
కోటకు చెందిన బైర్వా (21) అనే యువతి తన తల్లి, ముగ్గురు సోదరులతో కలిసి నివసిస్తోంది. గత వారం రోజులుగా ఆమె దేని గురించో టెన్షన్ పడడం వారు గమనించారు. కుటుంబ సభ్యులు ఎంత అడిగినా ఆమె ఏమీ చెప్పలేదు. శుక్రవారం ఉదయం వారంతా బంధువుల ఇంట్లో వేడుక కోసం వెళ్లారు. బైర్వా మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది. సాయంత్రం అందరూ తిరిగి వచ్చేసరికి ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఆత్మహత్యకు కారణాలేం తెలియలేదు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టమ్కు తరలించారు. కాగా, బైర్వాతో పాటు అదే ప్రాంతంలో చదువుకుంటున్న యువకుడు ఈ నెల 1వ తేదీన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మరో రెండ్రోజులకు బైర్వా కూడా చనిపోయింది. వీరిద్దరి చావుల వెనుక ఏదైనా సంబంధం ఉందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు.