తెల్లకార్డుదారులకు రూ.1000 రేపటి నుంచి పంపిణీ

ABN , First Publish Date - 2020-04-03T11:31:29+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెల్ల కార్డు కలిగివున్న ప్రతి కుటుంబానికి రూ.1000 అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామ/వార్డు వలంటీర్లు శనివారం నుంచి లబ్ధిదారుడి

తెల్లకార్డుదారులకు రూ.1000  రేపటి నుంచి పంపిణీ

  • జిల్లాకు రూ.105 కోట్లు విడుదల

విశాఖపట్నం, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెల్ల కార్డు కలిగివున్న ప్రతి కుటుంబానికి రూ.1000 అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామ/వార్డు వలంటీర్లు శనివారం నుంచి లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి ఈ సొమ్ము అందజేయనున్నారు. పింఛన్లు పంపిణీకి అవలంబించిన విధానాన్ని పాటించాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు కార్డుదారుడి ఇంటికి వెళ్లి కుటుంబ యజమాని ఫొటో తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని వలంటీర్లను ఆదేశించింది. డీఆర్‌డీఏ ఈ మేరకు సొమ్మును గ్రామ/వార్డు సచివాలయ ఖాతాలకు జమ చేసింది. 

Updated Date - 2020-04-03T11:31:29+05:30 IST