గజగజ
ABN , First Publish Date - 2020-12-05T04:45:41+05:30 IST
కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయి, చలి తీవ్రత పెరుగుతోంది.
- పెరిగిన చలి తీవ్రత
- 18 డిగ్రీలకు చేరిన కనిష్ఠ ఉష్ణోగ్రత
మహబూబ్నగర్, డిసెంబరు 4 : కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయి, చలి తీవ్రత పెరుగుతోంది. తేమ శాతం పెరిగి, చలిగాలులు వీస్తున్నాయి. వా తావరణంలో మార్పులు వస్తుండటంతో కనిష్ఠ ఉష్ణోగ్రత 18 డిగ్రీలకు చే రింది. డిసెంబరు మొదట్లోనే వాతావరణం ఇలా ఉండగా, రానున్న జన వరి, ఫిబ్రవరిలో చలిగాలులు మరింత తీవ్రం అయ్యే అవకాశాలు ఉన్నా యి. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉదయం ఎని మిది గంటలైనా చలి తీవ్రత తగ్గడం లేదు. సాయంత్రం ఐదు గంటల నుంచే చలి గాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమై, కేవలం మధ్యాహ్న సమయాల్లోనే వారి పనులను చేసుకుంటున్నారు. ఉ ద్యోగ, ఉపాధి నిమిత్తం పనులు చేసుకునే వారు చలికి వణుకుతున్నారు. దీంతో స్వెటర్లు, మంకీ క్యాప్లు ధరించి బయటకు వస్తున్నారు.