భర్త మరణం.. అనుమానంతో కుటుంబ సభ్యులకు కరోనా టెస్ట్ చేస్తే..
ABN , First Publish Date - 2020-08-14T17:29:25+05:30 IST
కామారెడ్డి పట్టణానికి చెందిన ఓ మహిళ కరోనాతో హైదరాబాద్లో మృతి చెందినట్లు సమాచారం. పట్టణంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో నివాసముంటున్న మహిళకు ఇటీవల కరోనా లక్షణాలు
కరోనాతో వివాహిత మృతి..
కామారెడ్డి టౌన్(ఆంధ్రజ్యోతి): కామారెడ్డి పట్టణానికి చెందిన ఓ మహిళ కరోనాతో హైదరాబాద్లో మృతి చెందినట్లు సమాచారం. పట్టణంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో నివాసముంటున్న మహిళకు ఇటీవల కరోనా లక్షణాలు ఉండడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే గతవారం రోజుల కిందట సదరు మహిళ భర్త మరణించడంతో అనుమానిత మృతిగా భావించి కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించగా వారిలో పలువురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు సమాచారం. అందులో ప్రస్తుతం మరణించిన మహిళ కూడా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబీకులు తీసుకెళ్లినట్లు, అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మరణించినట్లు సమాచారం.