80 కిలోమీటర్లు నడక
ABN , First Publish Date - 2020-05-24T07:13:47+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన గోల్డీ(20), కన్నౌజ్కు చెందిన వీరేంద్ర కుమార్(23)కు ఈ నెల 4న పెళ్లి జరగాల్సి ఉంది. లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఎలాగోలా పెళ్లి చేసుకుంటామంటూ...
- పెళ్లి కోసం యువతి సాహసం
లఖ్నవూ, మే 23: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన గోల్డీ(20), కన్నౌజ్కు చెందిన వీరేంద్ర కుమార్(23)కు ఈ నెల 4న పెళ్లి జరగాల్సి ఉంది. లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఎలాగోలా పెళ్లి చేసుకుంటామంటూ ఆ జంట కోరినా.. తల్లిదండ్రులు నిరాకరించారు. లాక్డౌన్ అయ్యేవరకూ వేచి ఉండాల్సిందేనన్నారు. దీంతో.. విరహం భరించలేని గోల్డీ, 80 కిలోమీటర్లు నడిచి కన్నౌజ్ సమీపంలోని బైసాపూర్ గ్రామంలో ఉన్న వీరేంద్ర ఇంటికి వెళ్లిపోయింది. అంతదూరం నడిచి వచ్చేసిన గోల్డీని చూసి వీరేంద్ర తల్లిదండ్రులు షాక్ తిన్నా తర్వాత తేరుకుని పెళ్లికి ఒప్పుకున్నారు. లాక్డౌన్ నిబంధనల్ని గౌరవిస్తూ ఆ జంట వివాహం చేసుకుంది. వధూవరులతో సహా అందరూ మాస్కుల్ని ధరించి, భౌతిక దూరం పాటిస్తూ పెళ్లి వేడుకలో పాల్గొనడం గమనార్హం.