తాగిన మైకంలో సహజీవనం చేస్తున్న వ్యక్తిని చంపేసింది!
ABN , First Publish Date - 2021-06-24T14:51:37+05:30 IST
తాగిన మైకంలో ఓ మహిళ సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసింది...
హైదరాబాద్ సిటీ/హయత్నగర్ : తాగిన మైకంలో ఓ మహిళ సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసింది. తట్టిఅన్నారం ఆర్కే నగర్లో నివాసముండే గాదె యాదగిరి(65) ఆటో డ్రైవర్. 2012లో యాదగిరి భార్య చనిపోవడంతో ఒంటరి మహిళ నర్సమ్మ(56)తో సహజీవనం చేస్తున్నాడు. మంగళవారం రాత్రి ఇద్దరూ కలిసి ఇంటి వద్దనే మద్యం తాగి గొడవపడ్డారు. నర్సమ్మ పక్కనే ఉన్న రోకలి బండతో యాదగిరి తలపై బాదడంతో కొనఊపిరితో కొట్టుకుంటుండగా స్థానికులు గమనించి హయత్నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు యాదగిరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా బుధవారం తెల్లవారు జామున మృతి చెందాడు. పోలీసులు నిందితురాలిని ఆదుపులోనికి తీసుకున్నారు. మృతుడి కుమారుడు రవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.