హోం మంత్రి ఎయిమ్స్‌లో ఎందుకు చేరలేదో: శశిథరూర్ ట్వీట్

ABN , First Publish Date - 2020-08-03T22:34:59+05:30 IST

ప్రభుత్వ సంస్థలకు ప్రముఖుల అండదండలు లభిస్తేనే వాటిపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యానించారు.

హోం మంత్రి ఎయిమ్స్‌లో ఎందుకు చేరలేదో: శశిథరూర్ ట్వీట్

తిరువనంతపురం: ప్రభుత్వ సంస్థలకు ప్రముఖుల అండదండలు లభిస్తేనే వాటిపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యానించారు. హోం మంత్రి అమిత్ షా ప్రస్తావన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హోం మంత్రి అమిత్ షా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం గురుగావ్‌లోని మేదాంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం తనకు బాగానే ఉందని కానీ డాక్టర్ల సలహా మేరకు ఆస్పత్రిలో చేరుతున్నానని షా ఆదివారం నాడు ట్వీట్ చేశారు. కాగా.. దీనిపై శశిథరూర్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘అనారోగ్యంతో ఉన్న మన హోం మంత్రి ప్రైవేటు ఆస్పత్రికి బదులుగా ఎయిమ్స్‌లో ఎందుకు చేరలేదా అని ఆలోచిస్తున్నాను. ప్రభుత్వ సంస్థలకు పెద్దల అండదండలు అవసరం. అప్పుడే వాటిపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది’ అని ఆయన ట్వీట్ చేశారు.




Updated Date - 2020-08-03T22:34:59+05:30 IST