ఘనంగా కార్తీకమాస పూజలు
ABN , First Publish Date - 2021-12-04T05:41:09+05:30 IST
జిల్లా కేంద్రంలోని శ్రీసంతోషిమాత దేవాలయంలో కార్తీకమాసం శుక్రవారం పురస్కరించుకొని కార్తీక పూజలు నిర్వహించారు.
సూర్యాపేట కల్చరల్, డిసెంబరు 3 : జిల్లా కేంద్రంలోని శ్రీసంతోషిమాత దేవాలయంలో కార్తీకమాసం శుక్రవారం పురస్కరించుకొని కార్తీక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చ కులు ఇరువంటి శివరామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, అమ్మవారికి పట్టు వస్త్రాలతో విశేషంగా అలంకరించారు. కార్యక్రమంలో దేవాలయ కమిటి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.