సూళ్లూరుపేటలో వైసీపీ దీక్షలు

ABN , First Publish Date - 2021-10-22T04:53:34+05:30 IST

ముఖ్యమంత్రిపై టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యల కు ఖండిస్తూ ఆ పార్టీ నేత చంద్రబాబునాయుడు క్షమాపణ చెప్పాలని సూళ్లూరు పేట ఎమ్మెల్యే కిలివేటి

సూళ్లూరుపేటలో వైసీపీ దీక్షలు

సూళ్లూరుపేట, అక్టోబరు 21 : ముఖ్యమంత్రిపై టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యల కు ఖండిస్తూ ఆ పార్టీ నేత చంద్రబాబునాయుడు క్షమాపణ చెప్పాలని సూళ్లూరు పేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద రెండురోజుల దీక్షలను గురువారం ప్రారంభించారు. చంద్రబాబునాయుడు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చి అది విఫలం కావడంతో దీక్షలకు దిగడం అప్రజాస్వామికమని అన్నారు. ఆయనతో పాటు ఎన్‌డీసీసీబీ చైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, అన్ని మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-22T04:53:34+05:30 IST