కమీషన్లకు కక్కుర్తిపడే నువ్వా విమర్శించేది!?
ABN , First Publish Date - 2021-10-19T03:25:29+05:30 IST
‘‘సబ్ కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లకు కక్కుర్తిపడే నువ్వా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డిని విమర్శించేద’’ని మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డిపై వైసీపీ నాయకులు ధ్వజమెత్తారు.
సుబ్బారెడ్డిపై వైసీపీ నేతల ధ్వజం
ఉదయగిరి రూరల్, అక్టోబరు 18: ‘‘సబ్ కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లకు కక్కుర్తిపడే నువ్వా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డిని విమర్శించేద’’ని మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డిపై వైసీపీ నాయకులు ధ్వజమెత్తారు. సోమవారం ఆర్అండ్బీ అతిథిగృహంలో వారు విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తినే విమర్శించడం సుబ్బారెడ్డి దిగజారుడు తనానికి నిదర్శమన్నారు. దమ్ము, ఽధైర్యం ఉంటే జడ్పీటీసీ, సర్పంచ్ పదువులకు రాజీనామా చేసి తిరిగి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. ఈ సమవేశంలో వైసీపీ మండల కన్వీనర్లు అక్కి భాస్కర్రెడ్డి, చింతంరెడ్డి సుబ్బారెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు గుంటుపల్లి మాలకొండయ్య, జడ్పీ, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు షేక్ గాజుల తాజుద్దీన్, షేక్ సుభానీ, జడ్పీటీసీ రమణారెడ్డి, సర్పంచ్ కల్లూరి వెంకటేశ్వరరెడ్డి, గోగుల వెంగళరెడ్డి, ఎంపీటీసీ తిరుపతి, మాజీ ఎంపీటీసీలు పాముల రమణయ్య, అడుసుమల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
వింజమూరు : ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డిపై ఆరోపణలు చేయడం సబబు కాదని వైసీపీ మండల కన్వీనర్ మద్దూరు లక్ష్మీప్రసాద్రెడ్డి అన్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ మేకపాటి సహకారంతో ఎన్నో పదువులు పొంది విమర్శించడం పద్ధతి కాదని హితవు పలికారు. ఈ సమావేశంలో ఎంపీపీ మోహన్రెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు ఆనంగి రమణయ్య, సర్పంచ్ సుగుణ, సొసైటీ అధ్యక్షులు జూపల్లి రాజారావు, నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి, గోవిందరెడ్డి, కొండపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.