పట్టాభిని పరుష పదజాలంతో దూషించిన వైసీపీ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-10-22T16:29:05+05:30 IST

జనాగ్రహ దీక్షల పేరుతో వైసీపీ నేతలు ప్రజలను రెచ్చగొడుతూ డైలాగులు విసురుతున్నారు.

పట్టాభిని పరుష పదజాలంతో దూషించిన వైసీపీ ఎమ్మెల్యే

విజయవాడ:  జనాగ్రహ దీక్షల పేరుతో  వైసీపీ నేతలు ప్రజలను రెచ్చగొడుతూ డైలాగులు విసురుతున్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌పై  టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నూజివీడులో వైసీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు  జనగ్రహ దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పూనకం వచ్చిన విధంగా స్టేజ్‌పైనే పట్టాభిపై ఎమ్మెల్యే ప్రతాప్‌ విరుచుకుపడ్డారు.  పట్టాభి ఖబర్ధార్, దమ్ముంటే రా, గుంటనక్క, బద్మాష్ వంటి పదజాలంతో ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ఊగిపోయారు. జనాలు చప్పట్లు కొడుతున్నారని  వైసీపీ నేతలు మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలను సంధిస్తున్నారు. 

Updated Date - 2021-10-22T16:29:05+05:30 IST