వైసీపీ గూండాగిరిని అడ్డుకుంటాం
ABN , First Publish Date - 2021-10-17T04:31:57+05:30 IST
వైసీపీ గూండాల ఆగడాలను అడ్డుకుంటామని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు చెప్పారు.
టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు
మార్కాపురం, అక్టోబరు 16 : వైసీపీ గూండాల ఆగడాలను అడ్డుకుంటామని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు చెప్పారు. పెద్దారవీడు మండలం మద్దలకట్ట వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి మూలా సత్యనారాయణరెడ్డి (సత్యంరెడ్డి), ఆయన కుమారుడు వెంకటేశ్వరరెడ్డి దాడిలో గాయపడి మార్కాపురం జిల్లా వైద్యశాలలో చికిత్స పొందుతున్న తంగిరాల జార్జి, ఆయన భార్య విజయకుమారిలను ఆయన శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అరాచకాలు చూస్తూ ఊరుకోబోమన్నారు. బాధితుల పక్షాన ఉండాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తూ అధికాపార్టీకి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఎరిక్షన్బాబు డిమాండ్ చేశారు. ఆయనతోపాటు టీడీపీ పెద్దారవీడు మండల కన్వీనర్ వెన్నా వెంకటరెడ్డి, టీడీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు షేక్ మహ బూబ్, మాజీ మండల అధ్యక్షుడు దొడ్డా భాస్కరరెడ్డి, టీడీపీ నాయకులు కొంగలీటి అనిల్కుమార్ పాల్గొన్నారు. దాడి ఘటనను ఖండిస్తూ బహుజన పార్టీ నాయకులు మార్కాపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీవో లక్ష్మీశివజ్యోతికి వినతిపత్రం అందజేశారు.