Telangana: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 12 గేట్లు ఎత్తివేత
ABN , First Publish Date - 2021-08-31T14:43:24+05:30 IST
జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్కు వరద ఉధృతి అధికంగా ఉంది.
మంచిర్యాల: జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్కు వరద ఉధృతి అధికంగా ఉంది. దీంతో అధికారులు 12 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 49187 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 64631 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను...ప్రస్తుత నీటి నిల్వ 18.7306 టీఎంసీలుగా నమోదు అయ్యింది.