మోసం చేశాడని యువతి ఆత్మహత్య.. యువకుడి అరెస్ట్
ABN , First Publish Date - 2021-05-07T14:01:26+05:30 IST
ఓ యువతి ఆత్మ హత్యకు కారణమైన యువకుడిని
హైదరాబాద్/ఏఎస్రావునగర్ : ఓ యువతి ఆత్మ హత్యకు కారణమైన యువకుడిని గురువారం కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కాప్రా గాంధీనగర్ కాలనీకి చెందిన ఓ యువతి (19) గత నెల 19న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణ చేపట్టారు. అదే కాలనీకి చెందిన కార్తీక్(24) అనే యువకుడు సదరు యువతిని ప్రేమిస్తున్నానని, నమ్మించి మోసం చేసినట్లు తేలింది. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడమే గాక తనను కాదని మరో అమ్మాయితో చనువుగా ఉండడంతో కార్తీక్ను యువతి నిలదీసింది. కార్తీక్ పెళ్లికి నిరాకరించి, దూరం పెడుతుండడంతో మనస్థాపానికి గురైన ఆ యువతి ఏప్రిల్ 19న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు కార్తీక్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.