రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-12-04T04:03:45+05:30 IST
ఆర్థిక ఇబ్బందులకు తట్టుకోలేక యువకుడు ఎంగలి వెంకటేష్(22) గు రువారం రా త్రి గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ శుక్రవారం తెలిపారు.
గద్వాల క్రైం, డిసెంబ రు 3 : ఆర్థిక ఇబ్బందులకు తట్టుకోలేక యువకుడు ఎంగలి వెంకటేష్(22) గు రువారం రా త్రి గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ శుక్రవారం తెలిపారు. గద్వాల జిల్లాలోని రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్న నర్సింహులు, రాములమ్మకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు సతీష్, చిన్న కుమారుడు వెం కటేష్(22) ఉన్నారు. గతంలో నర్సింహులు రాఘవేంద్రకాలనీలో మగ్గం పనులు చేసేవాడు. ప్రస్తుతం 76 సంవత్సరాలు వయస్సున్న నర్సిం హులుకు శరీరం సహకరించకపోవడంతో అత ని కుమారులు మొదట మగ్గం పనిలో కూలీలు గా చేసేవారు. ఇద్దరు అన్నదమ్ముళ్లల్లో అన్న స తీష్కుమార్ బీఈడీ పూర్తిచేసి డీఎస్సీ కోసం చదువుతున్నాడు. వెంకటేష్ మాత్రం రెండు నె లల నుంచి డ్రైఫ్రూట్స్ కొద్దికొద్దిగా కొనుగోలు చే స్తూ ప్యాకెట్స్ చేసి అమ్ముతుండేవాడు. ఈ క్ర మంలో అతనికి కొద్దిగా నష్టం రావడంతో గురువారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి పట్టణ శివారులోని ఎస్వీ ఈవెంట్ గార్డెన్ వెనుక గుర్తుతెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నా డు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న ట్లు రైల్వే హెడ్కానిస్టేబుల్ తెలిపారు.