ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-06-07T05:00:17+05:30 IST
జోగులాంబ గద్వాల జిల్లా అయిజకు చెందిన డాక్యుమెంటరీ రైట ర్ ఉప్పరి దివాకర్ (23) ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకు న్నాడు.
అయిజ, జూన్ 6: జోగులాంబ గద్వాల జిల్లా అయిజకు చెందిన డాక్యుమెంటరీ రైట ర్ ఉప్పరి దివాకర్ (23) ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకు న్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన చిన్నోనిపల్లి శ్రీనివాసులు, పార్వతమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. దివాకర్ నాలుగవ సంతానం. ఆయన డాక్యుమెంటరీ రైటర్గా జీవ నం సాగిస్తున్నాడు. అతడు ఆదివారం స్నేహితులతో కలిసి శ్రీశైలానికి వెళ్లినట్లు సమాచారం. అక్కడి ఉప్పరి సత్రంలో బస చేశాడు. సోమవారం మధ్యాహ్నం సత్రంలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అనుమానాస్పద మృతిగా అక్కడి పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.