షాపింగ్ మాల్లో ఆత్మహత్య చేసుకున్న 23 ఏళ్ల కుర్రాడు.. టైల్స్పై కారణాలు రాసి మరీ..
ABN , First Publish Date - 2021-09-11T21:35:03+05:30 IST
అతడు తన స్నేహితుడికి ఫోన్ చేసి షాపింగ్ మాల్కు రమ్మన్నాడు.. తన స్నేహితుడు వచ్చే సరికే షాపింగ్మాల్లోని ఓ కార్నర్లో ఉరేసుకున్నాడు..
అతడు తన స్నేహితుడికి ఫోన్ చేసి షాపింగ్ మాల్కు రమ్మన్నాడు.. తన స్నేహితుడు వచ్చే సరికే షాపింగ్మాల్లోని ఓ కార్నర్లో ఉరేసుకున్నాడు.. ఇతరులు అతడిని కిందకు దించగా అప్పటికే అతడి ప్రాణాలు పోయాయి.. తన ఆత్మహత్యకు గల కారణాలను అతడు అక్కడి గచ్చుపై రాశాడు.. ఇద్దరు వ్యక్తుల వల్ల తను చనిపోతున్నట్టు పేర్కొన్నాడు.. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఈ ఘటన జరిగింది.
భోపాల్కు చెందిన నిహాల్ సింగ్ (23) శుక్రవారం సాయంత్రం తన స్నేహితుడు హరీష్ వర్మకు ఫోన్ చేసి అసిమా మాల్కు రమ్మని చెప్పాడు. రాత్రి 8 గంటలకు హరీష్ వెళ్లేటప్పటికి అసిమా మాల్లోని ఓ కార్నర్లో నిహాల్ ఉరేసుకుని కనిపించాడు. పక్కనున్న వారి సహాయంతో నిహాల్ శరీరాన్ని హరీష్ కిందకు దించాడు. అప్పటికే నిహాల్ ప్రాణాలు పోయాయి. కిందన ఉన్న టైల్పై నిహాల్ తన ఆత్మహత్యకు గల కారణాలు రాశాడు.
పదివేల రూపాయల విషయంలో తనను ఇద్దరు వ్యక్తులు మోసం చేశారని పేర్కొంటూ వారి పేర్లు రాశాడు. అలాగే ఆత్మహత్య చేసుకుంటున్నందుకు క్షమించమని తన అన్నయ్యను అడిగాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టమ్కు తరలించారు. నిహాల్ కుటుంబ సభ్యులను, సూసైడ్ నోట్లో నిహాల్ రాసిన పేర్లు గల వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.