యువత క్రీడలపై ఆసక్తి చూపాలి

ABN , First Publish Date - 2021-01-14T05:12:28+05:30 IST

యువత చదువుతోపాటు ఆటలపై కూడా ఆసక్తి చూపాలని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ తెలిపారు.

యువత క్రీడలపై ఆసక్తి చూపాలి


రణస్థలం: యువత చదువుతోపాటు ఆటలపై కూడా ఆసక్తి చూపాలని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ తెలిపారు. మేమున్నాం సంస్థ ఆధ్వర్యంలో స్థానిక జడ్పీ హైస్కూల్‌ ప్రాంగణంలో బుధవారం క్రికెట్‌ పోటీలు జరిగాయి. ఈ పోటీలను  ఎమ్మెల్యే ప్రారంభించారు.  పది జట్లు తలబడుతున్నాయి. కార్యక్రమంలో మేమున్నాం సంస్థ అధ్యక్షుడు పచ్చిగుళ్ల సాయిరామ్‌, సేవా ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఇడదాసుల తిరుపతిరాజు, పిన్నింటి సత్యంనాయుడు, దన్నాన సీతారాం, టేక్‌ బ్రహ్మాజి తదితరులు పాల్గొన్నారు. 

  

Updated Date - 2021-01-14T05:12:28+05:30 IST