వివేకా హత్య కేసు...పులివెందుల చేరుకున్న సీబీఐ బృందం
ABN , First Publish Date - 2021-09-15T14:34:05+05:30 IST
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో భాగంగా సీబీఐ బృందం పులివెందులకు చేరుకుంది.
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో భాగంగా సీబీఐ బృందం పులివెందులకు చేరుకుంది. వైఎస్ వివేకా నివాసంలో రెండవ రోజు సీన్ రీ కన్స్ట్రక్షన్ కొనసాగనుంది. వివేకా హత్యజరిగిన రోజున నివాసంలోకి ఎవరెవరు వెళ్ళారు.. ఆరోజు రాత్రి ఎవరెవరు ఇంట్లో తిరగారు..అనేదానికి షార్ట్ లెటర్స్తో టీషర్ట్లు వేయించి సీబీఐ బృందం రిహార్సల్స్ చేయిస్తోంది. టిషర్ట్లపై సునీల్, దస్తగిరి, ఉమాశంకర్, రంగన్న పేర్లు ఉన్నట్లు సమాచారం.