వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-08-30T22:22:14+05:30 IST

కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. ఆయన హోం ఐసోలేషన్‌లో...

వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి కరోనా పాజిటివ్

ఇడుపులపాయ: కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్థంతి సందర్భంగా సీఎం జగన్ 1,2 తేదీల్లో ఇడుపులపాయలో పర్యటించనున్నారు. సీఎంతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశమున్న వైఎస్ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ముందు జాగ్రత్తగా కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనతో సన్నిహితంగా ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాల్సిందిగా ఎంపీ అవినాష్‌రెడ్డి సూచించారు. ఇదిలా ఉంటే.. శనివారం నాడు వైఎస్ అవినాష్ రెడ్డి పార్టీ ఆఫీస్‌లో పలువురిని కలుసుకున్నారు. ఎంపీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వారంతా టెస్టులు చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. 

Updated Date - 2020-08-30T22:22:14+05:30 IST