వ్యవసాయశాఖ మంత్రిని కలిసిన జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్
ABN , First Publish Date - 2021-10-24T04:27:56+05:30 IST
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డిని శనివారం ఆసిఫాబాద్ జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్ హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆసిఫాబాద్ రూరల్, అక్టోబరు 23: వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డిని శనివారం ఆసిఫాబాద్ జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్ హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి జిల్లా లోని పలుఅంశాలపై చర్చించారు. పీఏసీఎస్ చైర్మన్ లకు సంబంధించిన ప్రోటోకాల్ నిబంధనలు విడుదల చేయాలని, జీతభత్యాలకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆయనవెంట సింగిల్విండో చైర్మన్ అలీబీన్ అహ్మద్, శ్రీశైలం యాదవ్ ఉన్నారు.