వంతెనను పరిశీలించిన జడ్పీటీసీ

ABN , First Publish Date - 2021-06-14T04:13:49+05:30 IST

మండలంలోని తంగెళ్లపల్లి గ్రామసమీపంలో ఎర్రవాగుపై నిర్మిస్తున్న వంతెనను ఆదివారం జడ్పీటీసీ టి శ్రీరామరావు పరిశీలించారు.

వంతెనను పరిశీలించిన జడ్పీటీసీ
వంతెనను పరిశీలిస్తున్న జడ్పీటీసీ శ్రీరామరావు

దహెగాం, జూన్‌ 13: మండలంలోని తంగెళ్లపల్లి గ్రామసమీపంలో ఎర్రవాగుపై నిర్మిస్తున్న వంతెనను ఆదివారం జడ్పీటీసీ టి శ్రీరామరావు పరిశీలించారు. వంతెన నిర్మాణ పనులు పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ వంతెననిర్మాణంతో తంగెళ ్లపల్లి, చిన్నతిమ్మాపూర్‌, పెద్ద తిమ్మాపూర్‌ గ్రామాలకు రవాణా సౌకర్యం కలుగుతుందన్నారు. అదే విధంగా దహెగాం, భీమిని, కన్నెపల్లి మండలాల్లో గ్రామాలకు రవాణా సౌకర్యం కలుగుతుందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కన్వీనర్‌ సంతోష్‌గౌడ్‌, నాయకులు బాలకిషన్‌ రావు, భూమయ్య, భీమన్న తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-06-14T04:13:49+05:30 IST