CBN Arrest: సేవ్ ఏపీ...సేవ్ డెమోక్ర‌సీ అంటూ ‘‘కాంతితో క్రాంతి’’ కార్యక్రమాన్ని ప్రారంభించిన నారా లోకేష్

ABN , First Publish Date - 2023-10-07T19:47:50+05:30 IST

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబునాయుడు(Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌కు సంఘీభావంగా ఢిల్లీలో నిర్వ‌హించిన ``కాంతితో క్రాంతి`` కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ (Nara Lokesh) పాల్గొన్నారు.

CBN Arrest:  సేవ్ ఏపీ...సేవ్ డెమోక్ర‌సీ అంటూ ‘‘కాంతితో క్రాంతి’’ కార్యక్రమాన్ని ప్రారంభించిన నారా లోకేష్

ఢిల్లీ: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబునాయుడు(Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌కు సంఘీభావంగా ఢిల్లీలో నిర్వ‌హించిన ``కాంతితో క్రాంతి`` కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్(Nara Lokesh) పాల్గొన్నారు. సేవ్ ఏపీ...సేవ్ డెమోక్ర‌సీ అంటూ కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని నారా లోకేష్ ప్రారంభించారు. లైట్లు ఆపి, కొవ్వొత్తులు వెలిగించి వైసీపీ స‌ర్కారు తీరుపై నిర‌స‌న తెలిపారు. ఈ నిరసన కార్య‌క్ర‌మానికి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరి..

రాజమహేంద్రవరంలో "కాంతితో క్రాంతి" కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పాల్గొని సేవ్ ఏపీ... సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు ఇచ్చారు. కార్యక్రమం అనంతరం నారా భువనేశ్వరి విజయవాడకు బయలుదేరి వెళ్లారు.

4455.jpg

టీడీపీ కేంద్ర కార్యాలయంలో..

అమరావతి: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ``కాంతితో క్రాంతి`` కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వ చర్యలపై నిరసన తెలిపారు. పార్టీ కార్యాలయంలో లైట్లు ఆర్పి కొవ్వొత్తులు, కాగడాలు వెలిగించి నేతలు నిరసన తెలిపారు. పార్కింగ్‌లో కార్ల లైట్లు బ్లింక్ కొడుతూ చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు నిమ్మల రామానాయుడు, గద్దె రామ్మోహన్, దేవినేని ఉమామహేశ్వరరావు, నక్కా ఆనంద్ బాబు, పీతల సుజాత, అశోక్ బాబు, పంచుమర్తి అనురాధ, జీవీ ఆంజనేయులు, వర్ల రామయ్య, తదితరులు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలి వచ్చి వైసీపీ ప్రభుత్వ చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కడపలో..

668.jpg

కడప: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా నారా లోకేష్ పిలుపు మేరకు కడపలో "కాంతితో క్రాంతి" కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వ చర్యలపై నిరసన తెలిపారు. కడప నగరంలోని చిన్నచౌక్‌లో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో "కాంతితో క్రాంతి" కొవ్వోత్తులతో నిరసన ర్యాలీ తీశారు. ర్యాలీలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి, కడప టీడీపీ ఇన్‌చార్జి మాధవిరెడ్డి పాల్గొన్నారు.

కర్నూలులో ..

13.jpg

కర్నూలు జిల్లాలో "కాంతితో క్రాంతి" కార్యక్రమంలో కొవ్వొత్తులతో సంఘీభావం తెలుపుతున్న టీడీపీ నేతలు

Updated Date - 2023-10-07T22:02:46+05:30 IST