Share News

YSRCP: వైసీపీ నాయకుల అత్యుత్సాహం.. పట్టించుకోని పోలీసులు..!

ABN , Publish Date - May 04 , 2024 | 10:47 AM

జగ్గయ్యపేట రూరల్ మండల పరిధిలోని తిరుమలగిరిలో వైసీపీ నాయకుల అత్యుత్సాహం వెలుగు చూసింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామంలోకి రాగా వైసీపీకి చెందిన జెండాలను వెంటనే స్థానిక నాయకుడు తన ఇంటి ముందు కార్యకర్తలతో కట్టించాడు. అయినా సరే పోలీసులు పట్టించుకోవడం లేదు. దీంతో సి బిజిల్ యాప్‌కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.

YSRCP: వైసీపీ నాయకుల అత్యుత్సాహం.. పట్టించుకోని పోలీసులు..!

విజయవాడ: జగ్గయ్యపేట రూరల్ మండల పరిధిలోని తిరుమలగిరిలో వైసీపీ నాయకుల అత్యుత్సాహం వెలుగు చూసింది. తెలుగుదేశం పార్టీ (TDP) అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామంలోకి రాగా వైసీపీకి చెందిన జెండాలను వెంటనే స్థానిక నాయకుడు తన ఇంటి ముందు కార్యకర్తలతో కట్టించాడు. అయినా సరే పోలీసులు పట్టించుకోవడం లేదు. దీంతో సి బిజిల్ యాప్‌కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. తక్షణమే రంగంలోకి దిగిన ఫ్లయింగ్ స్క్వాడ్ ప్రతి ఇంటి ముందు పెట్టిన జెండాలను వీడియోలు తీసి.. ఆపై ఆ ఇంటి యజమానులతోనే జెండాలను ఊడదీయించారు. గ్రామంలో ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టనట్టే వ్యవహరించారు. వైసీపీ ప్రభుత్వానికి ఇంకా అండగా పోలీసులు పని చేస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి...

AP Election 2024: పిఠాపురంలో పవన్ పోటీపై ముద్రగడ కూతురు సంచలన వ్యాఖ్యలు.. జగన్‌కు ఊహించని షాక్

Hyderabad: వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా ఎస్సైనే బెదిరించి దోచుకున్నారు..

Read Latest AP News And Telugu News

Updated Date - May 04 , 2024 | 10:47 AM