Home » AP Election 2024
Andhrapradesh: జిల్లాలో అర్ధాతరంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ బూత్లు మూసివేశారు. గడువు ఉండగానే పోలింగ్ బూత్లు మూసివేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని జూనియర్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ బూత్లను అధికారులు మూసివేశారు. అయితే పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నేటి వరకు గడువు ఉంది.
Andhrapradesh: తెలుగు దేశం పార్టీకి ముస్లిం సంఘాలు పూర్తి మద్దతు తెలుపుతున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవాలని, చంద్రబాబు సీఎం అవ్వాలని ముస్లిం సంఘాల నేతలు కోరుతున్నారు. తాజాగా టీడీపీకి జమాత్ ఉలమ ఏ హింద్ పూర్తి మద్దతు తెలిపింది. గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జమాత్ ఉలమ ఏ హింద్ జాతీయ అధ్యక్షులు మౌలానా సుహైబ్ ఖాసిమి భేటీ అయ్యారు.
ఏపీలో ఎన్నికల(ap elections 2024) ఓటింగ్కు ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది. సమయం తక్కువగా ఉండటంతో ఓటర్లకు నగదును(cash) పంచేందుకు పలు పార్టీలు పెద్ద ఎత్తున నగదును పంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల దృష్ట్యా పోలీసు బృందాల పెట్రోలింగ్, తనిఖీల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట పరిధిలో భారీగా నగదును పట్టుకున్నారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. పార్టీలన్నీ ఈ ఎన్నికలను సవాల్గా తీసుకున్నాయి. అధికారం కోల్పోకూకడదని వైసీపీ.. అధికారాన్ని దక్కించుకోవాలని ఎన్డీఏ కూటమి పోటాపోటీగా సభలు నిర్వహిస్తున్నాయి. నేడు కర్నూలు నగరానికి సీఎం జగన్ రానున్నారు. ఎస్బీఐ సర్కిల్ వైఎస్సార్ విగ్రహం వద్ద జగన్ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
కరువు నేలకు సాగునీరు జీవం పోస్తుంది. వ్యవసాయమే జీవనాధారమైనచోట రైతులు మొదట ఆశించేది నీటినే. కాలువ నీటితో పొలాలను పచ్చగా మార్చేందుకు చెమటోడుస్తారు. నీరే లేకుంటే కుదేలైపోతారు. ఎప్పుడు కురుస్తుందో తెలియని వానకోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసి.. అలసిపోవడం ఇక్కడి ప్రజలకు అలవాటైంది. ‘మా బతుకులు ఇంతేనా..?’ అని ఆవేదన పడే సమయంలో.. ‘మారుస్తాం.. నీరిస్తాం..’ అని ఎవరు చెప్పినా విశ్వసిస్తారు. ఆశపడి.. ఆదరిస్తారు. వైసీపీ అధినేత వైఎస్ జగన ఇలాంటి హామీనే ...
వైసీపీకి ఓటమి భయం పట్టుకుందా..? కూటమికే అధికారమిస్తున్నారని ప్రజల నాడి పసిగట్టేశారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఓ వైపు ఆ పార్టీ మేనిఫెస్టో నింపిన అసంతృప్తి, మరోవైపు ఆ పార్టీ అధినేత జగన స్వరంలో మార్పు, ఇంకోవైపు బీజేపీ అగ్రనేతలు.. అందులోనూ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమితషా విరుచుకుపడుతుండటంతో వైసీపీ అభ్యర్థులకు గుబులు పట్టుకుంది. డబుల్ ఇంజిన సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ పెద్దలు ప్రజల్లో చైతన్యం నింపారు. బీజేపీ అగ్రనేతలు జగన పాలనపై విమర్శనాసా్త్రలు సంధించిన తరువాత సీఎం జగన మాటల్లో బేలతనం స్పష్టంగా కనిపిస్తోంది. ...
డబుల్ ఇంజిన ప్రభుత్వంతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని టీడీపీ కూటమి అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి నరేంద్రమోదీ ప్రధాని అవుతారని, ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించడం తథ్యమని ఆయన ధీమావ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన ఆంధ్రజ్యోతితో బుధవారం మాట్లాడారు. ప్రచారంలో ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది..? అంబికా: జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి...
ఎప్పుడూ పోలీసులే వాహనాలను తనిఖీ చేయాలా..? ఏం.. వారి వాహనాలను మాత్రం తనిఖీ చేయకూడదా..? ఎన్నికల నేపథ్యంలో అనంతపురం నగరంలో పోలీసు వాహనాలను అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న ఆధ్వర్యంలో అధికారులు బుధవారం తనిఖీ చేశారు. అధికార పార్టీ అభ్యర్థుల తరఫున కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది ఓట్ల కొనుగోలుకు పూనుకోవడం గురించి ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు వస్తున్నాయి. ఓటుకు రూ.3 వేలు ఇస్తామని పోస్టల్ బ్యాలెట్ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం, అనంతపురం అర్బనలో ఈ వ్యవహారం..
పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీ డబ్బు పంపిణీని ప్రారంభించింది. ఓటుకు రూ.2 వేల ప్రకారం బుధవారం పంచినట్లు తెలిసింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరవర్గం నియోజకవర్గంలో తిష్టవేసి.. డబ్బు పంపిణీ వ్యవహారాలను చూస్తోందని ప్రచారం జరుగుతోంది. గ్రామాల్లో ముఖ్యమైన నాయకులకు డబ్బులు చేరవేసి.. అక్కడి నుంచి పంచాయతీల వారీగా డబ్బులు చేరవేస్తున్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీ పరిధిలో వలంటీర్లను దగ్గర పెట్టుకుని.. వైసీపీ...
విజయవాడలో టీడీపీ-బీజేపీ-జనసేన (ఎన్డీయే) కూటమి చేపట్టిన రోడ్ షో సూపర్ హిట్ అయ్యింది. గంటన్నర సేపు బెజవాడ వీధుల్లో ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కలిసి సంయుక్తంగా రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ రోడ్ షోపై పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా స్పందించారు.