Share News

Purandeswari: బొత్స వోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలింకా మరచిపోలే..

ABN , Publish Date - May 09 , 2024 | 10:28 AM

మంత్రి బొత్స సత్యనారాయణపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. పచ్చకామెర్ల వారికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందని అన్నారు. అవినీతి చేసే వారికి అంతా అవినీతిమయంగానే కనిపిస్తుందని పురందేశ్వరి ఫైర్ అయ్యారు. బొత్స చేసిన వోక్స్ వాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు.

Purandeswari: బొత్స వోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలింకా మరచిపోలే..

అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana)పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. పచ్చకామెర్ల వారికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందని అన్నారు. అవినీతి చేసే వారికి అంతా అవినీతిమయంగానే కనిపిస్తుందని పురందేశ్వరి ఫైర్ అయ్యారు. బొత్స చేసిన వోక్స్ వాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. విశాఖ రైల్వే జోన్‌కు రాష్ట్రం ఇచ్చిన భూమి అనువుగా లేదన్నారు. వంద కోట్ల పైగా కేంద్రం రైల్వేజోన్ కు ఇస్తుంటే ఎందుకు అందిపుచ్చుకో లేకపోయారని ప్రశ్నించారు. పసలేని ఆరోపణలు చేయడం ఎంతవరకూ సమంజసమో ఆలోచించుకోవాలని హితవు పలికారు. ప్రధాని మోదీని విమర్శించే అర్హత బొత్సకు లేదని పురందేశ్వరి తెలిపారు.

ఇవి కూడా చదవండి...

Andhra Pradesh : అప్పుల కుప్ప

Andhra Pradesh : కడప బాద్‌షా ఎవరో?

Read Latest AP News And Telugu News

Updated Date - May 09 , 2024 | 10:40 AM