AP News: వైసీపీకి ఓటు వేసి తప్పు చేశా.. పరిటాల సునీత కాళ్లు పట్టుకున్న కార్యకర్త..

ABN , First Publish Date - 2022-12-27T16:13:51+05:30 IST

అనంతపురం (Anantapuram): టీడీపీ చేపట్టిన ‘ఇదేం కర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత రాప్తాడు నియోక వర్గంలోని మారూరులో పర్యటించారు.

AP News: వైసీపీకి ఓటు వేసి తప్పు చేశా.. పరిటాల సునీత కాళ్లు పట్టుకున్న కార్యకర్త..

అనంతపురం (Anantapuram)

టీడీపీ (TDP) చేపట్టిన ‘ఇదేం కర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunita) రాప్తాడు (Raptadu) నియోక వర్గంలోని మారూరులో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో పరిటాల సునీతను చూసిన వైసీపీ కార్యకర్త (YCP Activist) రామాంజనేయులు భావోద్వేగానికి గురయ్యాడు. ఆమె కాళ్లపై పడి బోరున విలపించాడు. గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి తప్పు చేశానని, తనను క్షమించాలని ప్రాధేయపడ్డాడు. కంటతడిపెట్టిన రామాంజనేయులను సునీత ఓదార్చారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని ధైర్యంగా ఉండాలని చెప్పారు.

Updated Date - 2022-12-27T16:15:59+05:30 IST