Jagadish Reddy : స్వార్ధరాజకీయాల వల్లే మునుగోడు ఉపఎన్నిక

ABN , First Publish Date - 2022-10-22T19:23:59+05:30 IST

స్వార్ధరాజకీయాల వల్లే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మరోసారి కుట్రలు చేసి కేంద్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ యత్నించిందన్నారు.

Jagadish Reddy : స్వార్ధరాజకీయాల వల్లే మునుగోడు ఉపఎన్నిక

Hyderabad : స్వార్ధరాజకీయాల వల్లే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మరోసారి కుట్రలు చేసి కేంద్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ యత్నించిందన్నారు. బీజేపీకి కేసీఆర్ భయం పట్టుకుందన్నారు. కేసీఆర్‌ను తెలంగాణకే పరిమితం చేసేలా బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. వ్యక్తుల ప్రాబల్యంతోనే గత ఉపఎన్నికల్లో గెలిచారే తప్ప బీజేపీతో కాదన్నారు. ఇంకా జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఓ వ్యక్తిని కొనడానికి మోదీ రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు. ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీతో టచ్‌లో ఉన్నాననడం దిగజారుడుతనమే. మునుగోడులో ఓడితే పదవి నుంచి తీసివేస్తారనే రేవంత్‌రెడ్డికి భయం. ఏడ్చేవారికి ఏం సమాధానం చెప్తాం? భారత్ జోడో యాత్రను ఎవరూ పట్టించుకోవటం లేదు. రాహుల్.. పార్టీనే జోడించడం లేదు, దేశాన్ని ఏం జోడిస్తారు?’’ అని ప్రశ్నించారు.

Updated Date - 2022-10-23T20:19:58+05:30 IST