Bodh Gaya: దలైలామాను కలిసిన నితీష్

ABN , First Publish Date - 2022-12-30T20:13:37+05:30 IST

టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శుక్రవారంనాడు బుద్ధగయలో..

Bodh Gaya: దలైలామాను కలిసిన నితీష్

బుద్ధగయ: టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా (Dalai Lama)ను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) శుక్రవారంనాడు బుద్ధగయ (Bodh Gaya)లో కలుసుకున్నారు. మహా బోధి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. దలైలామ ప్రస్తుతం బుద్ధగయలో పర్యటిస్తు్న్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఆయన బుద్ధగయకు రాలేదు. ఏటా జరిగే గయ సందర్శనను ఆయన మళ్లీ ఈ ఏడాది ప్రారంభించారు. నితీష్ ఆయనను కలుసుకునేందుకు రావడంతో మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12.40 గంటల ప్రాంతంలో దలైలామాను నితీష్ కలుసుకోగా, ఉభయులూ అరగంట సేపు సమావేశమయ్యారు.

అనంతరం మీడియాతో నితీష్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఇదే సమయంలో లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు బుద్ధగయకు వస్తారని, ఇది ఏళ్ల క్రితం నాటి సంప్రదాయమని అన్నారు. రెండేళ్లుగా కరోనా కారణంగా ఈ సంప్రదాయానికి ఆటంకం కలిగిందన్నారు. తిరిగి బుద్ధగయ సందర్శన ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక్కడకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలాలామాతో తనకు చిరకాల అనుబంధం ఉందని చెప్పారు.

Updated Date - 2022-12-30T20:13:45+05:30 IST