Home » National News
మొఘల్ రాజు ఔరంగజేబ్తో తనను పోలుస్తూ శివసేన నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. ఎవరెంతగా ఆడిపోసుకున్నా శక్తిమాత ) అనుగ్రహం తనకు రక్షణ కవచంలా నిలుస్తోందని అన్నారు.
లోక్సభ ఎంపీ, మహారాష్ట్రలోని అమ్రావతి లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి నవనీత్ కౌర్ రాణాపై తెలంగాణలోని షాద్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాంగ్రెస్కు ఓటు వేయడమంటే పాకిస్థాన్కు ఓటు వేయడమేనంటూ నవనీత్ కౌర్ బీజేపీ హైదరాబాద్ అభ్యర్థి మాధవి లత తరఫున చేసిన ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు.
దేశీయ స్టాక్ మార్కెట్లో(Stock market) గత రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు (మే 10) దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ ఫ్లాట్గా ప్రారంభమైంది. ఈ క్రమంలో ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 121 పాయింట్ల లాభంతో 72,525 వద్ద మొదలుకాగా, నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 22,009 వద్ద ప్రారంభమైంది.
వైశాఖ మాసం శుక్ల పక్షంలోని తృతీయ తిథి నాడు అక్షయ తృతీయ(Akshaya Tritiya) పండుగను జరుపుకుంటారు. ఈ రోజున లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఈ సందర్భంగా బంగారం, వెండి లేదా ఏదైనా కొత్త వస్తువును కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. ఈ నేపథ్యంలో అక్షయ తృతీయ రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
హిమాలయాల చార్ ధామ్ యాత్ర(Char Dham Yatra 2024) నేడు అక్షయ తృతీయ పండుగ రోజున ప్రారంభమైంది. చాలా రోజుల తర్వాత గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ ఆలయాల తలుపులు ఉదయం 6:55 గంటలకు ఒకేసారి తెరుచుకున్నాయి. ప్రారంభోత్సవాన్ని తిలకించేందుకు దాదాపు 15 వేల మంది యాత్రికులు(devotees) గంగోత్రి, కేదార్నాథ్ ధామ్లకు చేరుకున్నారు.
శుక్ల పక్షం తృతీయ రోజున జరుపుకునే పవిత్రమైన పండుగ అక్షయ తృతీయ(Akshaya Tritiya). ఈ సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా అక్షయ తృతీయ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఈ రోజు బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు బ్యాంకులు ఉంటాయా లేదా హాలిడే(holiday) ఉందా. ఉంటే ఏ ప్రాంతాల్లో ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
2024 ఎన్నికలు రాహుల్ గాంధీకి, ప్రధాని మోదీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) వ్యాఖ్యానించారు. హోంమంత్రి యాదాద్రి భువనగిరిలోని బహిరంగ సభలో ప్రసంగించిన క్రమంలో ఈ మేరకు పేర్కొన్నారు.
ఈరోజు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) పద్మవిభూషణ్ అవార్డు(Padma Vibhushan Award) అందుకోనున్నారు. సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డును స్వీకరించనున్నారు.
తమిళనాడు బీజేపీ మాజీ ఎమ్మెల్యే సి.వేలాయుధం బుధవారంనాడు కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. తమిళనాడు అసెంబ్లీకి 1996లో బీజేపీ టిక్కెట్పై గెలిచిన తొలి ఎమ్మెల్యే కూడా ఆయనే కావడం విశేషం.వేలాయుధం మృతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక ట్వీట్లో సంతాపం తెలిపారు.
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు. తన సొంత సమ్మతిపై ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని, ఆయన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వెంటనే ఆమోదించారని పార్టీ జనరల్ సెక్రటరీ ఇన్చార్జి జైరామ్ రమేష్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలియజేశారు.